పదును అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగలపారే ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కళకళలాడుతూ ఉండేవి. కానీ ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేదిలేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పనికోసం బయలుదేరారు. అలా వెళ్లిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బల వంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరకి వెళ్లి 'ఏదైనా పని ఉంటే ఇప్పించండి' అని అడిగాడు బలరాం. 'అడవికి వెళ్లి చెట్లు నరకాలి, చేయగలవా' అని వ్యాపారి అడిగాడు. 'చేయగలను' అన్నాడు బలరాం. 'రోజూ నువ్వు కొట్టే చెట్ల సంఖ్యనుబట్టి జీతం ఇస్తాను' అని వ్యాపారి చెప్పాడు. 'అలాగే' అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలిరోజే ఉత్సాహంగా పది చెట్లను నరికాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందిం చాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు బలరాం. మరునాడూ అదే ఉత్సాహంతో అడవికి వెళ్లాడు బలరాం. కానీ ఎనిమిది చెట్లన...